16లోగా విభజన ప్రక్రియ పూర్తి..

14 Dec, 2021 03:29 IST|Sakshi

20వ తేదీలోగా ఉద్యోగుల కేటాయింపు ఆదేశాలు

తర్వాత వారం రోజుల్లో విధుల్లోకి ఉద్యోగులు

సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఆదేశాలు

సాక్షి, హైదరాబాద్‌: ఉద్యోగుల విభజనకు సంబంధించిన ప్రక్రియను ప్రభుత్వం మరింత వేగవంతం చేసింది. ఈ మేరకు షెడ్యూల్‌తో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ సోమవారం రాత్రి రెండు జీవోలను జారీ చేశారు. ఇప్పటికే పూర్తయిన సీనియారిటీ జాబితాపై అవసరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

ఈ నెల 16వ తేదీలోగా జిల్లా, జోనల్, మల్టీ జోనల్‌ విభజన పూర్తి చేయాలని, 20వ తేదీలోగా సంబంధిత అధికారులు కేటాయింపు ఆదేశాలు జారీ చేయాలని ఆదేశించారు. ఇది పూర్తయిన వారం రోజుల్లో ఉద్యోగులు కేటాయించిన విధుల్లో చేరాలని స్పష్టం చేశారు. ఈ దిశగా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ప్రక్రియ కోసం జిల్లా అధికారుల నేతృత్వంలో కమి టీలను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి జోనల్‌ పరిధిలో రిపోర్టింగ్‌ అథారిటీ ఏర్పాటుకు సంబంధించిన మార్గదర్శకాలు జీవోల్లో వివరించారు.  

మరిన్ని వార్తలు