వడదెబ్బకు ఒకరి మృతి

10 Jun, 2023 00:24 IST|Sakshi

మల్కాపురం: సేవా మార్గంలో నడుచుకెళ్తున్న ఓ వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలాడు. ఆ వ్యక్తి వడదెబ్బకు గురై చనిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు తెలిపి న వివరాలివీ.. 58వ వార్డు రామ్‌నగర్‌ ప్రాంతానికి చెందిన పెంటకోట కృష్ణ (55) శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో రామ్‌నగర్‌ నుంచి శ్రీహరిపురం వెళ్లి.. అక్కడి నుంచి గణేష్‌ మందిర్‌ మార్గం వైపు నడుచుకుని వస్తున్నాడు. గణేష్‌ మందిరం సమీపంలోని రాగానే అతను ఒక్కసారిగా కుప్పకూలాడు. అక్కడ బస్టాప్‌ వద్ద ఉన్న కొంత మంది కృష్ణ మద్యం సేవించి పడిపోయాడేమోనని భావించి పట్టించుకోలేదు. 11 గంటల వరకు ఆయన లేవకపోవడంతో.. అనుమానం వచ్చి మల్కాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులకు అక్కడకు చేరుకుని.. ఆ వ్యక్తిని పరిశీలించారు. వడదెబ్బ కారణంగా మృతి ఉంటారని భావించి ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.

మరిన్ని వార్తలు