నర్సంపేట: మండల కేంద్రానికి చెందిన కక్కెర్ల శ్రీనివాస్ ఆంగ్లంలో డాక్టరేట్ను శుక్రవారం అందుకున్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం ఇంగ్లిష్ విభాగం పరిశోధకులు శ్రీనివాస్ గాంధీయన్ ఐడియాలజి కింద ‘సెలెక్ట్ నావల్స్ ఆఫ్ రాజారావు, ముల్క్రాజ్, ఆనంద్, ఆర్కె.నారాయణ్ ’అంశంపై పరిశోధన పత్రం సమర్పించారు. దీనికి గాను డాక్టరేట్ను ప్రదానం చేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణ అధికారి మల్లారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇంగ్లిష్ విభాగం ఆచార్యులు మేఘనారావు ఆధ్వర్యంలో పీహెచ్డీని పూర్తి చేశారు. దీంతో శ్రీనివాస్ను స్థానికులు, అధ్యాపకులు, పరిశోధకులు అభినందించారు.