రాష్ట్రస్థాయి ఈత పోటీలకు కాట్రపల్లి విద్యార్థులు | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి ఈత పోటీలకు కాట్రపల్లి విద్యార్థులు

Published Fri, Nov 24 2023 1:30 AM

రాష్ట్రస్థాయి ఈత పోటీలకు ఎంపికై న విద్యార్థులు  - Sakshi

రాయపర్తి: ఎస్‌జీఎఫ్‌ రాష్ట్రస్థాయి ఈత పోటీలకు మండలంలోని కాట్రపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికై నట్లు పీఈటీ పుట్ట సమ్మయ్య తెలిపారు. హనుమకొండ బాలసముద్రంలోని డీఎస్‌ఏ స్విమ్మింగ్‌పూల్‌లో గురువారం ఉమ్మడి వరంగల్‌ జిల్లాస్థాయి ఈత పోటీలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. పాఠశాల విద్యార్థులు పోటీల్లో ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు తెలిపారు. ఈనెల 24 నుంచి 26 వరకు రంగారెడ్డి జిల్లాలోని బాచుపల్లి జీఏఎం స్పోర్ట్స్‌ అకాడమీలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో వారు పాల్గొంటారని వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన పదో తరగతి విద్యార్థులు పి.రాజేష్‌, జె.శ్రీకాంత్‌, రాకేష్‌, తొమ్మిదో విద్యార్థులు కె.అరవింద్‌, కె.రాంచరణ్‌, కె.జగదీష్‌ను హెచ్‌ఎం ఝాన్సీలక్ష్మి, ఎస్‌ఎంసీ చైర్మన్‌ గుమ్మడిరాజు శ్రీనివాస్‌, సర్పంచ్‌ బోనగిరి ఎల్లయ్య పీఈటీ, ఉపాధ్యాయులు అభినందించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement