మొరం మాఫియా వీరంగం

22 Nov, 2023 01:12 IST|Sakshi

హసన్‌పర్తి: మండల కేంద్రంలో మొరం దందా జోరుగా సాగుతోంది. అడ్డు చెప్పేవారు లేకపోవడంతో ఈదందా చేస్తున్న అక్రమార్కులు కోట్లకు పడగలెత్తుతున్నారు. తాజాగా తమ వ్యాపారానికి అడ్డొస్తున్నాడనే ఆగ్రహంతో హరిశ్చంద్రనాయక్‌ తండా ఉపసర్పంచ్‌ రాజుపై దాడికి దిగారు. ఈఘటనలో రాజుకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడు హసన్‌పర్తి పోలీస్‌ స్టేషన్‌లో మంగళవారం రాత్రి ఫిర్యాదు చేశారు. సిద్దాపురం–హరిశ్చంద్రనాయక్‌ తండాల మధ్య ఉన్న గుట్టను కొంతమంది అక్రమార్కులు మొరం క్వారీగా మార్చారు. ఏడాది కాలంగా ఈ దందా సాగుతోంది. అయితే వ్యాపారానికి ఉప సర్పంచ్‌ రాజు అడ్డొస్తున్నాడని మంగళవారం రాత్రి మొరం అక్రమార్కులు దాడికి దిగారు. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడు రాజు ఫిర్యాదు మేరకు విచారణ జరుపుతున్నట్లు పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ గోపీ తెలిపారు.

ఉప సర్పంచ్‌పై దాడి.. తీవ్ర గాయాలు

పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు

మరిన్ని వార్తలు