నల్లగొండ టౌన్: నల్లగొండలో శనివారం జరిగిన బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభ విజయవంతమైంది. ఆశించిన స్థాయిలో సభకు జనం తరలి రావడంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సహాన్ని నిండింది. నల్లగొండ, మునుగోడు, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, నకిరేకల్, దేవరకొండ నియోజకవర్గాల నుంచి జన సమీకరణ చేశారు. కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్షా మధ్యాహ్నం 2.22 నిమిషాలకు వేదికపైకి చేరుకోగానే కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కేరింతలు కొట్టారు. అమిత్షా తన 19 నిమిషాల ప్రసంగంలో నరేంద్రమోదీ చేసిన అభివృద్ధిని ప్రస్తావిస్తూ రాష్ట్రంలో కేసీఆర్ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలు కుంభకోణాలపై వివరించారు. బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తేవాలని విజ్ఞప్తి చేశారు. అమిత్షా ప్రసగింస్తున్నంత సేపు కార్యకర్తలు ఉత్సాహంగా ఆయన ప్రసంగాన్ని వింటూ ఈలలు వేసి అభివాదం చేశారు.