బీఆర్‌ఎస్‌ పాలనలో అధికార దుర్వినియోగం | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ పాలనలో అధికార దుర్వినియోగం

Published Sun, Nov 19 2023 1:58 AM

మాట్లాడుతున్న 
మాజీ మంత్రి మోత్కుపల్లి  - Sakshi

యాదగిరిగుట్ట: బీఆర్‌ఎస్‌ పాలనలో సీఎం కేసీఆర్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఆయనను గద్దె దించి కాంగ్రెస్‌ పార్టీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధమయ్యారని జోస్యం చెప్పారు. యాదగిరిగుట్టలో శనివారం కాంగ్రెస్‌ పార్టీ ఆలేరు అభ్యర్థి బీర్ల ఐలయ్యతో కలిసి విలేకరులతో మాట్లాడారు. పదేళ్ల పాలనలో సీఎం కేసీఆర్‌ పథకాల పేరుతో ప్రజలను మోసం చేశారని విమర్శించారు. తూతూ మంత్రంగా దళితబంధు ఇచ్చారని విమర్శించారు. ఆలేరు నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి బీర్ల ఐలయ్యను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి్‌, ఎంపీపీ చీర శ్రీశైలం, కౌన్సిలర్‌ ముక్కెర్ల మల్లేష్‌యాదవ్‌, నాయకులు కానుగు బాలరాజు, ఇంజ నరేష్‌, గుండ్లపల్లి భరత్‌, టీడీపీ నియోజకవర్గ కన్వీనర్‌ రేగు బాల్‌నర్సయ్య తదితరులున్నారు.

ఫ మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు

Advertisement
Advertisement