భిక్షాటన చేస్తూ వినూత్న ప్రచారం | Sakshi
Sakshi News home page

భిక్షాటన చేస్తూ వినూత్న ప్రచారం

Published Sun, Nov 19 2023 2:00 AM

భిక్షాటన చేస్తూ ప్రచారం చేస్తున్న తెలంగాణ బతుకమ్మ పార్టీ అభ్యర్థి మహిపాల్‌రెడ్డి   - Sakshi

ఆలేరురూరల్‌: తెలంగాణ బతుకమ్మ పార్టీ ఆలేరు అభ్యర్థి కందాడి మణిపాల్‌రెడ్డి శనివారం ఆలేరు పట్టణంలో భిక్షాటన చేస్తూ ప్రచారం నిర్వహించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొట్లాడి సాధిచుకున్న తెలంగాణలో నిరుద్యోగల జీవితాలు అంధకారంలోకి వెళ్లిపోయాయని అన్నారు. తొమ్మిదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ఆలేరు అభివృద్ధి శూన్యమన్నారు. ధన బలంతో గెలిచిన వారు తమ వ్యక్తిగత అభివృద్ధిని కోరుకుంటున్నారే తప్ప.. ఆలేరు ప్రాంతాన్ని పట్టించుకోవడం లేదన్నారు. మైకు గుర్తుకు ఓటు వేసి తనను అధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వెంకటేష్‌, రవి, శ్రీనివాస్‌, మహిళలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement