More

ప్రాణం తీసిన మూఢనమ్మకం

9 Jul, 2020 09:17 IST
భాగ్య (ఫైల్‌)

పాముకాటుకు వివాహిత మృతి

దౌల్తాబాద్‌: మూఢనమ్మకానికి ఓ నిండు ప్రాణం బలైన సంఘటన మండలంలోని నీటూరు గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు.. నీటూరు గ్రామానికి చెందిన సిలింపురం రమేష్, భాగ్య భార్యభర్తలు. వీరికి 11 నెలల బాబు ఉన్నాడు. మంగళవారం రాత్రి ఎప్పటి మాదిరిగా ఇంట్లో నిద్రిస్తున్నారు. రాత్రి 11గంటలకు భాగ్య(22)కు నిద్రలో చేతికి ఏదో కరిచినట్లయింది. లేచి చూసేసరికి పాము కనిపించింది. వెంటనే వారు ఆటోలో ఓ మంత్రగాడి దగ్గరికి బుల్కపూర్‌కు వెళ్లారు. నయం అవుతుందని మంత్రగాడు చెప్పడంతో ఇంటికి వచ్చేశారు. ఉదయం మళ్లీ శరీరంలో మార్పులు రావడంతో చికిత్స నిమిత్తం తాండూరు ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో వికారాబాద్‌కు తరలిస్తుండగా మృతిచెందింది.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

అయ్యయ్యో..ఎంత విషాదం: మంచికోసం వెళ్లి..మృత్యు ఒడిలోకి!

విశాఖ: స్కూల్‌ ఆటో-లారీ ఢీ

ఫొటో జర్నలిస్ట్‌ గోపాల్‌పై దాడి

Nov 22nd: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

ఈ–చలానా కేసులో ప్రధాన నిందితుడు కొమ్మారెడ్డి అవినాష్‌ అరెస్టు