More

జేఎన్యూలో కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్

19 Jan, 2016 19:44 IST

న్యూఢిల్లీ: ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసి.. ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఢిల్లీలోని జవహార్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ)లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ మైనర్ బాలిక జేఎన్‌యూ క్యాంపస్ లో గత కొన్నేళ్లుగా ఓ ప్రొఫెసర్ ఇంట్లో పనిచేస్తోంది.

ఆ బాలికను సోమవారం రాత్రి కొందరు వ్యక్తులు క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేశారు. దూరంగా తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత తిరిగి వర్సిటీ ప్రాంగణంలోనే వదిలి వెళ్లారు. ముందు ప్రైవేటు ఆస్పత్రికి ఆ బాలికను తరలించి అనంతరం ప్రభుత్వ ఆస్పత్రికి పంపించారు. 'ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్' (పోస్కో) చట్ట ప్రకారం పోలీసులు కేసు నమోదుచేశారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ పోరు: ఆనంద్‌ మహీంద్ర వీడియో గూస్‌ బంప్స్‌ ఖాయం!

ఇలా ఎందుకు? అయోమయంలో ఆనంద్‌ మహీంద్ర: ట్వీట్‌ వైరల్‌

కస్టమర్లకు అలర్ట్‌: దేశవ్యాప్త సమ్మెకు దిగనున్న ఉద్యోగులు

డీప్‌ఫేక్‌తో భారత్‌కు ముప్పు: మోదీ

జమ్ముకశ్మీర్‌లో ఐదుగురు ఉగ్రవాదులు హతం