వేటకు వెళ్లి ఇద్దరి మృతి

20 Aug, 2015 08:58 IST|Sakshi

రేచర్ల: ప్రకాశం జిల్లాలో కుందేళ్లను వేటాడేందుకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు ప్రమాదవశాత్తు మృతి చెందారు. ఈ ఘటన జిల్లాలోని రేచర్ల మండలంలో గురువారం వేకువ జామున వెలుగులోకి వచ్చింది. మండలంలోని అరవీటికోట గ్రామానికి చెందిన రసూల్(35), రంగనాయకులు(25) బుధవారం అర్ధరాత్రి తర్వాత కుందేళ్లను వేటాడేందుకు పొలాల్లోకి వెళ్లారు. దీంతో పొలాల్లో ఉన్న విద్యుత్ వైర్లు తగలి ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.

మరిన్ని వార్తలు