వేర్వేరు రోడ్డు ప్రమాదాలు: 40 మందికి గాయాలు

10 May, 2014 08:43 IST|Sakshi

తూర్పుగోదావరి జిల్లా రంగపేట వద్ద కాకినాడ నుంచి రాజమండ్రి వెళ్తున్న ఆర్టీసీ బస్సు, ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొన్నాయి. ఆ ప్రమదంలో 25 మంది ప్రయాణికులు గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు.

 

పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని స్థానికుల సహయంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అలాగే లారీ క్యాబిన్లో ఇరుకున్న డ్రైవర్ను బయటకు తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆర్టీసీ బస్సు, లారీ ఢీ కొన్న ప్రమాదంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.



అలాగే శ్రీకాకుళం జిల్లా టెక్కలి సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఆ ఘటనలో 15 మంది గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు