కరోనా అరికట్టేందుకు పటిష్ట చర్యలు : వెల్లంపల్లి

15 Apr, 2020 14:44 IST|Sakshi

సాక్షి, విజయవాడ : విజయవాడ పశ్చిమనియోజకవర్గ సచివాలయ సిబ్బందికి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ నిత్యావసరాల సరుకులు పంపిణీ చేశారు‌.  విపత్కర కాలంలో ప్రాణాలు పణంగా పెట్టి  సచివాలయసిబ్బంది,
వాలంటీర్లు పనిచేస్తున్నారని మంత్రి అభినందించారు.

ప్రభుత్వ పరంగానే కాకుండా పార్టీపరంగానూ ప్రతిఒక్కరూ సహాయ కార్యక్రమాలు చేపట్టాలని  సీఎం వైఎస్‌ జగన్‌ ఇచ్చిన పిలుపు మేరకు నిత్యావసరాల పంపిణీ చేసినట్టు మంత్రి తెలిపారు. కరోనా వైరస్‌ను అరికట్టేందుకు ప్రభుత్వం  పటిష్టమైన చర్యలు తీసుకుంటోందన్నారు.

మరిన్ని వార్తలు