చంద్రబాబుపై రాజధాని రైతుల ఆగ్రహం

30 May, 2018 11:38 IST|Sakshi

సాక్షి, అమరావతి: చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై ఏపీ రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం చెక్కులు పంపిణీ చేయలేదు. ప్రభుత్వం ఇచ్చే చెక్కుల కోసం రైతులు ఏడాది కాలంగా ఎదురు చూస్తున్నారు.

మూడేళ్ల క్రితమే భూములిచ్చిన రైతులకు మే 1 కల్లా చెక్కులు చెల్లిస్తామని ప్రభుత్వం గతంలో జీవో జారీ చేసింది. అయితే ఇప్పటి వరకు చెక్కులు ఇవ్వలేదు . దీంతో రైతులు తీవ్ర అసహనానికి గురవతున్నారు. భూములు తీసుకునేటప్పుడు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని, ఇలా అయితే ఎలా బతకాలని రైతులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు.

మరిన్ని వార్తలు