ఏపీ రాష్ట్ర చిహ్నాలు ఇవే..

30 May, 2018 18:51 IST|Sakshi

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్ర చిహ్నాలను ఖరారు చేసింది.  వేప చెట్టును రాష్ట్ర వృక్షంగా, కృష్ణ జింకను రాష్ట్ర జంతువుగా, రామ చిలుకను రాష్ట్ర పక్షిగా, మల్లె పువ్వును రాష్ట్ర పుష్పంగా గుర్తిస్తూ అటవీ శాఖ పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  ఇంతకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రాష్ట్ర పక్షిగా పాలపిట్ట ఉండేది. దాని స్థానంలో రామ చిలుకను రాష్ట్ర పక్షిగా గుర్తిస్తున్నట్లు వెల్లడించారు.

మరిన్ని వార్తలు