బొబ్బిలి: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సభలో ప్లకార్డులు పట్టుకున్నందుకు విధుల నుంచి తొలగించటంపై విజయనగర్ జిల్లా బొబ్బిలిలో అంగన్వాడీ కార్యకర్తలు గురువారం ఆందోళనకు దిగారు. వారం క్రితం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సభ జరిగింది. ఆ సభలో పాల్గొన్న కొందరు అంగన్వాడీ కార్యకర్తలు తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. దీనిపై స్పందించిన అధికారులు 15మంది కార్యకర్తలను విధుల నుంచి తొలగించారు.
ఇందుకుగానూ బొబ్బిలి ఎంపీడీవో కార్యాలయం ఎదుట గురువారం ఉదయం నిరసన తెలిపారు. తొలగించిన కార్యకర్తలను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.