సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌లపై టీడీపీ జులుం

3 Mar, 2019 19:21 IST|Sakshi

సాక్షి, గుంటూరు: ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏపీలో టీడీపీ అరాచకాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన వారిపై అక్రమం నిర్బంధం విధిస్తున్నారు. సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌లపై టీడీపీ నేతలు అక్రమ కేసులు బనాయిస్తున్నారు. తాజాగా గుంటూరులో పదిమంది యువకులను పోలీసుల అరెస్ట్‌ చేసిన ఘటన వివాదాస్పదంగా మారింది.

సీఎం చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారని అరండల్‌పేట పోలీసులు పదిమందిని యువకులను అదుపులోకి తీసుకున్నారు. విచారణ పేరుతో స్టేషన్లు తిప్పుతూ వేధింపులకు గురిచేస్తున్నారు. కనీసం కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వకుండా వారిని నిర్బంధంలోకి తీసుకున్నారు.  దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు