ఎవరెవరు ఏ గేట్ నుంచి....

7 Mar, 2015 08:34 IST|Sakshi
ఎవరెవరు ఏ గేట్ నుంచి....

హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. దాంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలకు సుమారు 2175మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే బందోబస్తును పర్యవేక్షించేందుకు ఈసారి కౌంటర్ నిఘా పెట్టారు.

కాగా ఎవరెవరు ఏ గేట్ నుంచి....
*గేట్-1 నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి, స్పీకర్, మంత్రులు
* గేట్-2 నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, స్పీకర్, మంత్రులతో పాటు ఉభయ రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేలు
* లాబీ వద్దకు సాధారణ నాయకులు, కార్యకర్తలు, సాధారణ ప్రజలను అనుమతించరు.

మరిన్ని వార్తలు