చిత్తూరు జిల్లాలో జయసుధపై దాడి

10 Sep, 2014 11:01 IST|Sakshi

చిత్తూరు: రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. ఎక్కడబడితే అక్కడ దాడులు చేస్తున్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్ సిపి కార్యకర్తలపై దాడులు ఎక్కువైపోయాయి. చిత్తూరు జిల్లా పట్టంబేడు మండలం గోనుపల్లి గ్రామంలో వైఎస్ఆర్ సిపి కార్యకర్త జయసుధపై టిడిపి నేత దాడి చేశాడు.

టిడిపి నేత రామానాయుడు తనపై దాడి చేయడంతో జయసుధ మనఃస్తాపానికి గురైంది. దాంతో ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే ఆమెను శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు