భానుకిరణ్ బ్యారక్‌ మార్పు

20 Feb, 2015 20:22 IST|Sakshi
భానుకిరణ్ బ్యారక్‌ మార్పు

హైదరాబాద్ సిటీ: అనంతపురం కాంగ్రెస్ నాయకుడు గంగుల సూర్యనారాయణ రెడ్డి అలియాస్ మద్డెల చెరువు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్‌ను చర్లపల్లి జైలులో ఒక బ్యారక్ నుంచి మరొక బ్యారక్‌కు మార్చారు. ప్రస్తుతం ఉంటున్న మానస బ్యారక్ నుంచి మంజీరా బ్యారక్‌కు మార్చారు. మద్దెల చెరువు సూరి వెంటే నమ్మకంగా ఉంటూ 2010లో కారులో కాల్చి పరారైన సంగతి తెలిసిందే.  తర్వాత మహారాష్ట్రలో పోలీసులు చాకచక్యంగా పట్టుకున్న సంగతి విదితమే.

మరిన్ని వార్తలు