బైక్ దొంగల ముఠా అరెస్ట్

11 Jul, 2015 11:56 IST|Sakshi

గంగవరం:  చిత్తూరు జిల్లాలోని కుప్పం, పలమనేరు, పుంగనూరు నియోజకవర్గాల్లో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఏడుగురు సభ్యుల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు శనివారం గంగవరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోలీసులు నిందితులను ప్రవేశపెట్టారు. తమిళనాడుకు చెందిన సత్యమూర్తి, సుబ్రమణ్యం, రాజేంద్రన్, అబ్దుల్ ఫరూక్‌లు గత కొంతకాలంగా బైక్ దొంగతనాలకు పాల్పడుతున్నారు.

అలా దొంగలించిన బైక్‌లను మధ్యవర్తులుగా ఉన్న రామసముద్రం మండలానికి చెందిన శ్రీనివాసులు, రమణ, మునుస్వామిలకు విక్రయిస్తున్నారు. వీరు ముగ్గురు తక్కువ ధరలకు ఆ బైక్‌లను కొని వేరే వ్యక్తులకు అమ్ముతున్నట్లు పోలీసులు తెలిపారు. వీరి వద్ద నుంచి 53 బైక్‌లు 143కిలోల 20 ట్రాన్స్‌ఫార్మర్స్‌కు చెందిన అల్యూమినియం తీగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ. 25 లక్షల వరకు ఉండవచ్చిని పోలీసులు అంచనా వేశారు. కేసు నమోదు చేసి నిందితులను కోర్టులో హాజరుపర్చనున్నట్టు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు