విపక్షానిది మొండివైఖరి: బొండా

13 Mar, 2015 11:49 IST|Sakshi
విపక్షానిది మొండివైఖరి: బొండా

హైదరాబాద్: ఏపీ శాసనసభలో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు మొండి వైఖరితో వ్యవహరిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరావు విమర్శించారు. విపక్షం సభా సమయాన్ని వృధా చేస్తోందని ఆయన ఆరోపించారు. సభా సమయాన్ని ఉపయోగించుకోవడంలో ప్రతిపక్షం విఫలమైందన్నారు.

తామే మాట్లాలన్న మొండి వైఖరితో వైఎస్సార్ సీపీ సభ్యులు వ్యవహరిస్తున్నారని, ఇది మంచి పద్దతి కాదని విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. చిన్నపిల్లాడు చెబితే వినడు, కొడితే ఏడుస్తాడు చందంగా విపక్షల సభ్యుల తీరు ఉందని వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు