టీడీపీ ఎమ్మెల్యే అనితపై కేసు నమోదు

15 Dec, 2014 13:10 IST|Sakshi
టీడీపీ ఎమ్మెల్యే అనితపై కేసు నమోదు

విశాఖ : విశాఖ జిల్లా టీడీపీ ఎమ్మెల్యే అనితపై పాయకరావు పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తనను నిర్భందించి చెప్పుతో కొట్టారని రామారావు అనే ప్రైవేటు ఉపాధ్యాయుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.  ఎమ్మెల్యే అనితతోపాటు పీఏ ప్రసాద్, ఎంపీటీసీ కాశీ విశ్వనాథ్ లపై రామారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఎమ్మెల్యే అనితను అరెస్ట్ చేయాలని బాధితుని బంధువులు పాయరావుపేట పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేశారు. మరోవైపు ఎమ్మెల్యే అనిత వ్యవహార శైలిపై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 

మరిన్ని వార్తలు