శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

19 Mar, 2017 20:28 IST|Sakshi

తిరుమల: తిరుమల శ్రీవారిని ఆదివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీరిలో రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు, కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, సినీ దర్శకుడు రాఘవేంద్రరరావు, సంగీత దర్శకుడు ఇళయరాజా, సినీనటుడు సోనూసూద్, నిర్మాత అశ్వినీదత్, టీటీడీ మాజీ చైర్మన్‌ సుబ్బిరామిరెడ్డి, ఏపీ క్రికెట్‌ మాజీ అధ్యక్షుడు చాముండేశ్వర్, కేంద్ర అధికార భాషా(హిందీ) అకాడమి చైర్మన్‌ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఆంధ్రాబ్యాంక్‌ చైర్మన్‌ సురేష్‌ ఎన్‌ పటేల్, గాయకులు శ్రావణభార్గవి, హేమచంద్ర దంపతులు ఉన్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించి లడ్డూప్రసాదాలు అందజేశారు.

మరిన్ని వార్తలు