సింగరాయకొండ:శ్రీకృష్ణునిపై ఉన్న భక్తితో చెన్నై నుంచి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని చైతన్యమహాప్రభు జన్మస్థలమైన మాయాపూర్ దేవాలయానికి సైకిల్ యాత్ర చేపట్టాడు ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్కు చెందిన కైను. ఆస్ట్రేలియా నుంచి చెన్నై వరకు విమానంలో వ చ్చి అక్కడి నుంచి సైకిల్పై ప్రయాణం సాగిస్తున్నాడు. మార్గమధ్యంలో ఇస్కాన్ దేవాలయాల్లో బసచేస్తూ 18 రోజుల్లో గమ్యానికి చేరుకుంటానని కైను ‘సాక్షి’కి తెలిపాడు. గత ఏడాది నేపాల్ దేశంలోని ఖాట్మండ్ నుంచి శ్రీకృష్ణుని జన్మస్థలమైన ఉత్తరప్రదేశ్లోని బృందావనానికి సైకిల్పై వెళ్లానని చెప్పాడు. మార్గమధ్యంలో స్వయంగా వంట చేసుకుని తింటానన్నాడు. శ్రీకృష్ణుని మీద ఉన్న భక్తి తనను ఎంత దూరం అయినా ప్రయాణించేలా చేస్తోందని వివరించాడు.