శ్రీకాకుళం :‘ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు కచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలోనే చదివేలా చట్టం చేయండి’ అని ఆమదాలవలస మండలం కె.మునగవలస ఎంపీటీసీ సభ్యురాలు గొర్లె దుర్గారాణి జగన్ను కోరారు. ఏటా డీఎస్సీతో పాటు ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సీఎం అయిన వెంటనే విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు.