కల్తీ మద్యం బాధితులను పరామర్శించిన చినరాజప్ప

7 Dec, 2015 19:29 IST|Sakshi

కల్తీ మద్యం విక్రయ దారులను చట్టరీత్యా కఠినంగా శిక్షించాలని ఉప ముఖ్య మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. విజయవాడలోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన సోమవారం పరామర్శించారు. ఈ సదర్భంగా మీడియాతో మాట్లాడారు. బాధితులకు మద్యం విక్రయదారుల నుంచే నష్ట పరిహరం ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని సూచించారు.



 

మరిన్ని వార్తలు