పెద్దదర్గాలో ఘనంగా ఉరుసు ఉత్సవం

25 Dec, 2014 02:58 IST|Sakshi

కడప కల్చరల్ : అస్థానె మగ్దూమ్ ఇల్లాహిలోని హజరత్ ఖ్వాజా సయ్యద్‌షా అమీనుల్లా హుసేనీ చిష్ఠివుల్ ఖాద్రీ సాహెబ్ ఉరుసు ఉత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. పీఠాధిపతి హజరత్ సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ గురువుల మజార్ వద్ద ప్రత్యేకంగా ఫాతెహా నిర్వహించారు.
 
  ఈ సందర్భంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు పీఠాధిపతి దర్శనం చేసుకుని ఆశీస్సులు పొందారు. దర్గా ప్రాంగణంలోని దుకాణాల వద్ద మహిళలు కిటకిటలాడారు. ఉదయం నుంచి రాత్రి వరకు దర్గా ఆధ్వర్యంలోని లంగర్‌ఖానాలో వేలాది మంది భక్తులకు భోజన సౌకర్యం కల్పించారు.
 

మరిన్ని వార్తలు