4వ తేదీన జిల్లాకు రానున్న సీఎం జగన్‌

1 Oct, 2019 14:04 IST|Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి : ఈ నెల 4న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ఏలూరులోని జిల్లా ఆసుపత్రిలో ఆయన మెడికల్‌ కళాశాల శంకుస్థాపన చేయనున్నారు. శంకుస్థాపన జరిగే స్థలాన్నిమంగళవారం ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని, కలెక్టర్‌ ముత్యాల రాజు పరిశీలించారు. అదే విధంగా ఏలూరు సర్‌ సీఆర్‌ఆర్‌ పబ్లిక్‌ స్కూల్లో ఏఎన్‌ఎమ్‌ సర్టిఫికెట్స్‌ పరిశీలన కార్యక్రమాన్ని మంత్రి ఆళ్ల నాని పరిశీలించారు. 

మరిన్ని వార్తలు