అనవసర సంకేతాలతో వైషమ్యాలు: వెంకయ్యనాయుడు

30 Jul, 2013 02:35 IST|Sakshi
అనవసర సంకేతాలతో వైషమ్యాలు: వెంకయ్యనాయుడు

తెలంగాణ విషయంలో స్పష్టమైన నిర్ణయాన్ని వెల్లడించకుండా కావాలనే అనవసర సంకేతాలిస్తూ కాంగ్రెస్ పార్టీ ఇరు ప్రాంతాల్లో వైషమ్యాలను పెంచుతోందని బీజేపీ సీనియర్ నేత ఎం.వెంకయ్యనాయుడు విమర్శించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుపై గతంలో ప్రకటన చేసిన యూపీఏ,  ఇప్పుడు స్వలాభం కోసం కొన్ని అనవసర సంకేతాలను పంపిందని ధ్వజమెత్తారు.

ఏది ఇస్తే ఎంత లాభం ఉంటుందనే ధోరణితో వ్యవహరించడం కాంగ్రెస్ నైజమని చెప్పారు. సోమవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు బీజేపీ తీర్మానం చేసిందని, దానికి కట్టుబడి ఉంటామని చెప్పారు. తెలంగాణ బిల్లుకు మద్దతు ఇచ్చే విషయమై ప్రశ్నించగా, అసలు బిల్లు ఏ రూపంలో ఉందో ముందు తెలియాలని, ఆ తర్వాత మద్దతు విషయాన్ని నిర్ణయిస్తామన్నారు.

మరిన్ని వార్తలు