వైఎస్ జగన్కు సీపీఐ కృతజ్ఞతలు

14 Mar, 2015 12:58 IST|Sakshi

అనంతపురం : ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ సీపీఐ శనివారం అనంతపురం జిల్లా బంద్కు పిలుపునిచ్చింది. జిల్లా బంద్కు వైఎస్ఆర్ సీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఇంటర్ పరీక్షల దృష్ట్యా విద్యా సంస్థలకు మినహాయింపు ఇచ్చినట్లు సీపీఐ తెలిపింది. ఉరవకొండలో ఆర్టీసీ బస్సులను సీపీఐ, వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు.

అలాగే పలుచోట్ల దుకాణాలు మూసివేయించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణకు వెంటనే విడుదల చేయాలని వైఎస్ఆర్ సీపీ నేత శంకర్నారాయణ డిమాండ్ చేశారు. రామకృష్ణకు మద్దతుగా అసెంబ్లీ నుంచి శుక్రవారం వాకౌట్ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్కు సీపీఐ నేతలు ఈ సందర్బంగా కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు