బతుకు బరువైంది.. ఆదుకోవయ్యా..

6 Aug, 2018 07:40 IST|Sakshi

తూర్పుగోదావరి : ‘వృద్ధురాలిని. సత్తువ లేక పనిచేసే పరిస్థితి కూడా లేదు. జీవనం కష్టసాధ్యంగా మారింది. కుటుంబ బాధ్యతలు చూసే భర్త లేడు. ప్రభుత్వం ఇచ్చే పింఛను డబ్బులు ఏ మాత్రం సరిపోవడం లేదు’ అంటూ పాదయాత్రలో తన సమస్యను జగన్‌కు చెప్పుకొన్నారు కత్తిపూడికి చెందిన నెల్లిపూడి సుబ్బాయమ్మ. రేషన్‌ కార్డులో తన ఒక్కరి పేరే ఉండటంతో కేవలం ఐదు కిలోల బియ్యం మాత్రమే ఇస్తున్నారని చెప్పారు. ‘పని చేసుకుని జీవించడానికి ఓపిక లేదయ్యా.. నా బతుక్కి ఓ దారి చూపించయ్యా!’ అంటూ జగన్‌ను వేడుకున్నారు.

>
మరిన్ని వార్తలు