ఎంపీ వ్యాఖ్యలపై విరుచుకుపడిన మాజీ సైనికులు

29 Jun, 2015 15:39 IST|Sakshi

తూర్పుగోదావరి(కాకినాడ): 'ఫ్రీ ఫుడ్...ఫ్రీ డ్రింక్... ఫ్రీ హాలిడేస్...' అంటూ జవాన్లను కించపరిచేలా అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు ఒక జాతీయ చానల్ చర్చావేదికలో చేసిన వ్యాఖ్యల పై మాజీ సైనిక ఉద్యోగులు ఫైర్ అయ్యారు. సైనికులకు రవీంద్రబాబు క్షమాపణ చెప్పి ఎంపీ పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సైనికుల పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రవీంద్ర బాబును టీడీవీ వెంటనే సస్పెండ్ చెయాలన్నారు.

పార్లమెంటుపై ముష్కరులు దాడి చేసినప్పుడు ఆర్మీ లేకపోతే ఎంపీల పరిస్థితి ఎంటో రవీంద్రబాబు ఆలోచించాలని మాజీ సైనికోద్యోగులు తెలిపారు.

>
మరిన్ని వార్తలు