టీడీపీ దొంగ ఓట్ల కుట్రలపై వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు

7 Dec, 2023 16:25 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడ్డారు. తెలంగాణలో ఓటు వేసినవారితో కూడా ఏపీలో కూడా ఓటు వేయించేందుకు చంద్రబాబు కుట్రలకు పాల్పడుతున్నారన్నారు.

డబల్‌ ఎంట్రీ ఓట్లను తొలగించాలంటూ విశాఖ జిల్లా కలెక్టర్లకు వైఎస్సార్‌సీపీ నేతలు వినతి పత్రం సమర్పించారు. డబుల్‌ ఎంట్రీ ఓట్లపై కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని వైఎస్సార్‌సీపీ నేతలు తెలిపారు.
 

>
మరిన్ని వార్తలు