సాగునీటి కోసం గ్రామస్తుల ఆందోళన

26 Feb, 2016 15:09 IST|Sakshi

పెంటపాడు (పశ్చిమగోదావరి జిల్లా) : పెంటపాడు మండలం మౌంజీపాడు, జెట్లపాలెం గ్రామాలకు చెందిన రైతులు శుక్రవారం రహదారిపై రాస్తారోకోకు దిగారు. పంట సాగుకు నీటిని విడుదల చేయాలని ఇరిగేషన్ అధికారులను అడ్డుకున్నారు. నీళ్లు వదులుతామని హామీ ఇచ్చే వరకు అధికారులను విడిచిపెట్టేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. ఈ విషయం గురించి అధికారులకు అడిగితే..వంతులవారీ విధానం ప్రకారం నీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు. మరో 3 రోజులు ఆగాల్సి ఉందని అన్నారు.

>
మరిన్ని వార్తలు