'..ఉన్న ఉద్యోగాల్ని పీకేస్తున్నారు'

16 Jul, 2014 19:45 IST|Sakshi
'..ఉన్న ఉద్యోగాల్ని పీకేస్తున్నారు'

పార్వతీపురం: విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం వెంకంపేటగోరీలు వద్ద స్థానిక రైతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని కలిశారు. కొత్త ప్రభుత్వం ఇప్పటివరకు పంటల పంటల రుణమాఫీ చేయకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. డ్వాక్రా రుణాలపై జగన్‌తో మహిళలు మాట్లాడారు.

పార్వతీపురం ఎంపీడీవో కార్యాలయం వద్ద వైఎస్ జగన్‌ను ఉపాధిహామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లు కలిశారు. ఇంటికో ఉద్యోగమన్న చంద్రబాబు ఉన్న ఉద్యోగాల్ని తీసివేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, తమను ఎస్టీల్లో చేర్చాలంటూ జగన్ ను రజకులు కోరారు.

మరిన్ని వార్తలు