యూఏఈలో సత్తా చాటిన భారత బాలుడు | Sakshi
Sakshi News home page

యూఏఈలో సత్తా చాటిన భారత బాలుడు

Published Wed, Jul 16 2014 7:23 PM

యూఏఈలో సత్తా చాటిన భారత బాలుడు

దుబాయ్: భారతీయ బాలుడొకరు యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్(యూఏఈ)లో అరుదైన ఘనత సాధించాడు. అరబీ మతోపన్యాస పోటీ 'ప్రీచర్ ఆఫ్ ద నేషన్'లో అతడు విజేతగా నిలిచి వార్తల్లో నిలిచాడు. కర్ణాటకలోని భక్తల్ ప్రాంతానికి చెందిన ఇబ్రహీం షబాన్ద్రీ ఈ ఘనత సాధించాడు. 70 పోటీదారులను వెనక్కు నెట్టి అతడు విజయం సాధించాడు.

అతడి వాక్పటిమకు అరబీ ప్రజలు, న్యాయ నిర్ణేతలు ముగ్దులయ్యారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ పోటీ నిర్వహించారు. తన కుమారుడు విజేతగా నిలవడం పట్ల ఇబ్రహీం తండ్రి ఫహీం అహ్మద్ హర్షం వ్యక్తం చేశాడు. ఎంతో కష్టపడి అంకితభావంతో తన కుమారుడు అరబీ నేర్చుకున్నాడని తెలిపాడు.

Advertisement
Advertisement