ఉన్మాది దాడి - ఐదుగురికి గాయాలు

15 Oct, 2015 14:41 IST|Sakshi

రైల్వే స్టేషన్‌లో అన్నం తింటున్న వారిపై ఓ ఆగంతకుడు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పట్టణంలో గురువారం చోటుచేసుకుంది.

పట్టణానికి చెందిన కొందరు బిచ్చగాళ్లు స్థానిక రైల్వేస్టేషన్‌లో అన్నం తింటుండగా గుర్తు తెలియని ఓ వ్యక్తి వారిని కర్రతో విపరీతంగా కొట్టాడు. దీంతో ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా, ప్రయాణికులు రైల్వే పోలీసులకు చెప్పటంతో ఉన్మాదిని అదుపులోకి తీసుకుని, స్టేషన్‌కు తరలించారు.
 

మరిన్ని వార్తలు