భారీగా పన్నుకట్టిన పూల వ్యాపారి

27 Jun, 2017 10:58 IST|Sakshi
భారీగా పన్నుకట్టిన పూల వ్యాపారి
చిత్తూరు: నగరానికి చెందిన ఓ పూల వ్యాపారి భారీగా పన్ను కట్టారు. రఘరామ్‌ అనే వ్యాపారి ఆదాయపు పన్ను శాఖకు రూ.36 లక్షల పన్నును చెల్లించారు. కాణిపాకంలో రూ.2 కోట్లతో రఘురామ్‌ కల్యాణ మండపం నిర్మించారు.
 
అయితే మండపానికి సంబంధించిన లెక్కలు చూపనందుకు ఐటీ అధికారులు ఇటీవల ఆయనకు నోటీసులు జారీ చేశారు. దీంతో ఆయన పూర్తిస్థాయిలో పన్ను చెల్లించారు.
మరిన్ని వార్తలు