కైకలూరు : కప్పలను పాములు మింగడం సహజం. అయితే పామును కప్ప మింగిన ఘటన గురువారం ఉదయం కృష్ణాజిల్లా కైకలూరు మండలం గోపవరం గ్రామంలో చోటుచేసుకుంది. పంటకాల్వలో తనను మింగేయడానికి ప్రయత్నించిన బురద పామును ఓ కప్ప గుటకాయ స్వాహా చేసింది.
గట్టిగా ఒడిసిపట్టిన కప్ప నుంచి తప్పించుకోలేక పాము విలవిల్లాడింది. ఈ పోరాటంలో అంతిమంగా కప్ప విజయం సాధించి పామును పూర్తిగా మింగి నీటిలోకి జారుకుంది. ఈ అరుదైన ఘటనను పలువురు వింతగా తిలకించారు.