గ్యాస్ సిలిండర్ పేలుడు: 3 ఇళ్లు దగ్ధం

24 Jan, 2015 11:11 IST|Sakshi

ముదినేపల్లి: కృష్ణా జిల్లా ముదినేపల్లి మండల కేంద్రంలో శనివారం మూడు ఇళ్లు దగ్ధమయ్యాయి. ప్రమాదవశాత్తూ రెండు గ్యాస్ సిలిండర్లు పేలటమే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది. సంఘటన సమయంలో ఇళ్లలో ఎవరూ లేకపోవటంతో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. ఆస్తినష్టం వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు