రాజమండ్రిలో గవర్నర్

11 May, 2015 22:21 IST|Sakshi

తూర్పుగోదావరి(రాజమండ్రి): తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ సోమవారం రాజమండ్రిలో పర్యటించారు. నిర్మాణంలో ఉన్న కోటిలింగాలఘాట్‌ను పరిశీలించారు. కోరకొండ మండలం శ్రీరంగపట్నంలో ‘నీరు - చెట్టు’ కార్యక్రమంలో పాల్గొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అనంతరం లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు.ఆలయంలో చిన్నారులు చేస్తున్న నృత్యాన్ని గవర్నర్ దంపతులు తిలకించారు.

>
మరిన్ని వార్తలు