ఒకసారి భార్యా బిడ్డల గురించి ఆలోచించండి

23 Oct, 2019 14:37 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా : జిల్లాలోని లక్కిరెడ్డిపల్లి మండలానికి చెందిన రైతు శంకర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం పట్ల ప్రభుత్వ చీఫ్‌ విస్‌ శ్రీకాంత్‌ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. బుధవారం శంకర్‌రెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించిన ఆయన మృతుని కుటుంబాన్ని ఆదుకోవడానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా.. రైతు బాగుంటేనే ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రైతులు మేలు కోరి అనేక నిర్ణయాలు తీసుకుంటుందని, రైతులెవరూ నిరాశ, నిస్పృహలకు లోనుకావద్దని విజ్ఞప్తి చేశారు. అఘాయిత్యానికి పాల్పడే ముందు ఒకసారి కుంటుంబం, భార్యాబిడ్డల గురించి ఆలోచించాలని సూచించారు. 

మరిన్ని వార్తలు