విశాఖ: చత్తీస్గఢ్ నుంచి తమిళనాడు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్టు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో కోస్తా, రాయలసీమలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దక్షిణ కోస్తాలో తీరం వెంబడి 45-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. మృత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.