‘శాంతి భద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు’

26 Jul, 2019 16:38 IST|Sakshi

అమరావతి: రాష్ట్ర శాంతి భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని.. హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. శుక్రవారం ఏపీ శాసన మండలిలో ‘శాంత్రి భద్రతల’పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా మేకతోటి సుచరిత మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక కేవలం ఆరు హత్యలు మాతమే జరిగాయన్నారు. ఆ ఆరు హత్యలు సైతం కేవలం వ్యక్తిగత, ఇతర కారణాలతో జరిగాయని వెల్లడించారు. ఈ హత్యలను తమ ప్రభుత్వానికి ఆపాదించడం సరికాదని విమర్శించారు. అదేవిధంగా ‘కోడెల కె ట్యాక్స్‌’ బాధితుల కేసులు ఇంకా నమోదవుతూనే ఉన్నాయన్నారు. కాగా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరినీ చూడమని పేర్కొన్నారు. ఈ క్రమంలో చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన రాజకీయ హత్యలు, దాడులపై హోంమంత్రి వివరిస్తుండగా.. టీడీపీ సభ్యులు మధ్యలోనే వాకౌట్ చేశారు. మంత్రి వివరణ ఇస్తుంటే మధ్యలోనే టీడీపీ సభ్యులు వాకౌట్‌ చేయడంపై వైఎస్సార్‌సీపీ శాసన సభ్యులు తీవ్రంగా ఆక్షేపణ తెలిపారు. 

మరిన్ని వార్తలు