సోనియాకు శంకర్రావు గుడి

12 Nov, 2013 13:38 IST|Sakshi
సోనియాకు శంకర్రావు గుడి

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నందుకు యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీకి సికింద్రాబాద్లో గుడి నిర్మించనున్నట్లు కంటోన్మెంట్ ఎమ్మెల్యే పి.శంకర్రావు వెల్లడించారు. మంగళవారం సికింద్రాబాద్లో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ... సోనియా గుడి నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని ఇప్పటికే నగర మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ధరఖాస్తు చేసినట్లు వెల్లడించారు. జీహెచ్ఎంసీ అధికారుల అనుమతి కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పారు.

 

సోనియ జన్మదినమైన డిసెంబర్ 9వ తేదీన ఆ గుడికి శంకుస్థాపన చేస్తామని వివరించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటులో కేంద్రం త్వరితగతిన అడుగులు వేస్తుంది. రాష్ట్ర విభజనతో తమకు తీరని అన్యాయం జరుగుతుందని అటు సీమాంధ్రలో ఆందోళనలు ఎగసిపడుతున్నాయి.

 

అయిన సోనియాగాంధీ వాటిని పట్టించుకోకుండా తనదైన శైలీలో తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయడంతో ఎమ్మెల్యే శంకర్రావు ఆనందంతో ఉబ్బితబ్బివవుతున్నారు. ఈ నేపథ్యంలో తన పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి గుడి నిర్మించాలని శంకర్రావు ఆకాంక్షించారు.   
 

మరిన్ని వార్తలు