ఓటు వేయకపోతే అభివృద్ధి ఆగిపోతుంది

14 Aug, 2017 01:02 IST|Sakshi
ఓటు వేయకపోతే అభివృద్ధి ఆగిపోతుంది
నంద్యాలలో మంత్రులు
 
సాక్షి బృందం, నంద్యాల: ఉప ఎన్నికలో టీడీపీకి ఓటు వేయకపోతే నంద్యాలలో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులు ఆగిపోయే అవకాశం ఉందని మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, అమరనాథ్‌రెడ్డి, కాలువ శ్రీనివాసులు అన్నారు. ఆదివారం సాయంత్రం వారు కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని విశ్వనగర్‌లో విశ్వబ్రాహ్మణులతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ నంద్యాలలో చేపట్టిన అభివృద్ధి పనుల కోసమైనా టీడీపీని ఆదరించాలని కోరారు. టీడీపీకి ఓటు వేస్తే విశ్వ బ్రాహ్మణుల సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు. విశ్వ బ్రాహ్మణుల సమావేశం అనంతరం మంత్రులు ఓ ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. సుమారు పదిహేను నిమిషాలు అక్కడ స్థానిక ముఖ్య నాయకులతో మాట్లాడారు.
మరిన్ని వార్తలు