ఎన్‌కౌంటర్‌లకు వ్యతిరేకంగా ఖైదీ నిరశన

14 Apr, 2015 19:42 IST|Sakshi

రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలీసులు ఎన్కౌంటర్ల పేరుతో ఒకేరోజు 25 మందిని హతమార్చడాన్ని మావోయిస్టు ఖైదీ సాకే కృష్ణ గర్హించారు. కడప సెంట్రల్ జైలులో ఉన్న ఆయన.. శేషాచలం, ఆలేరు ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా మంగళవారం రాత్రి నుంచి నిరశన చేపడుతున్నట్లు జైలు సూపరింటెండెంట్ గోవిందరాజులుకు సమాచారం ఇచ్చారు.

 

ఇదే విషయాన్ని జైలర్ మీడియాకు చెప్పారు. 2003లో అలిపిరి వద్ద నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై దాడి కేసులో సాకే కృష్ణ నిదితుడు.

మరిన్ని వార్తలు