త్వరలో ఇంటర్-వర్సిటీ బోర్డు

2 Jan, 2015 03:51 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: వర్సిటీల్లో పాలన, విద్యాపరమైన అంశాల్లో మార్గదర్శనం చేసేందుకు రాష్ట్రస్థాయిలో ఇంటర్-యూనివర్సిటీ బోర్డును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి (ఏపీఎస్‌సీహెచ్‌ఈ) తొలిసారిగా రూపొందించిన విద్యామండలి గణాంక పుస్తకాన్ని, ఆధునీకరించిన వెబ్‌సైట్‌ను చైర్మన్ వేణుగోపాలరెడ్డి గురువారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.  విద్యావ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు  కొత్త విధానాలను రూపకల్పన చేస్తున్నామన్నారు.
 

>
మరిన్ని వార్తలు