2019లో వార్ వన్‌సైడే!

29 Mar, 2017 11:31 IST|Sakshi



వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జాతకం అద్భుతంగా ఉందని, 2019లో వార్ వన్‌సైడే అవుతుందని పంచాంగకర్త రామచంద్ర శాస్త్రి చెప్పారు. పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన ఉగాది వేడుకలకు వైఎస్ జగన్ సహా పలువురు పార్టీ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రామచంద్రశాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు.

(ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

2019లో అంతా ఏకపక్షంగానే ఉంటుందని, ఈసారి రాబోయేది వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వమేనని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి త్వరలోనే ప్రత్యేక హోదా వస్తుందని, ఆ క్రెడిట్ అంతా జగన్‌కే దక్కుతుందని కూడా ఆయన అన్నారు. హేవళంబి నామ సంవత్సర ఉగాది సందర్భంగా పార్టీ కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసిన వైఎస్ జగన్.. పార్టీ నేతలు, కార్యకర్తలు, తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని వార్తలు